గుర్తుతెలియని మృతదేహం లభ్యం…

చిన్న శంకరంపేటఆగస్టు 4(మన వార్త ప్రతినిధి నరేందర్) చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని జీకే వైర్ పరిశ్రమ సమీపంలో సోమవారం ఉదయం ఒక మగ వ్యక్తి మృతదేహం ఉన్నదని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, పంచనామ నిర్వహించి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు, ఈ సందర్భంగా చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ సమాచారం మేరకు జీకే వైర్ పరిశ్రమ సమీపంలో ఒక … Read more

రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్యదర్శిగా వరాల దేవయ్య..

ఆదివారం రోజున హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన వారాల. దేవయ్య ను రాష్ట్ర కార్యదర్శి గా అధ్యక్షులు పుట్టo పురుషోత్తం రావు ఆదివారం రోజున నియామకం చేశారు.తన పై విశ్వాసం ఉంచి రాష్ట్ర కార్యదర్శి గా నియమించి నందుకు రాష్ట్ర కార్యవర్గము నకు వారాల దేవయ్య కృతజ్ఞతలు తెలియజేసారు

జగిత్యాలలో గంజాయి మొక్కల పెంపకం….

ఆగస్టు ,3 (జగిత్యాల మన వార్త ప్రతినిధి )జగిత్యాల రూరల్ మండలం నర్సింగా పూర్ లో ఓ ఇంటి సమీపంలో 4 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు రూరల్ పోలీసులు గుర్తించారు.ఈ యొక్క విషయానికి బాధ్యులైన మెతుకు రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నాగపురి సదాకర్ తెలిపారు.

ఎస్సార్ కళాశాల విద్యార్దిని అనుమానస్పద మృతి….

-ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్..–కళాశాలలో చేర్చే ముందు ఒకసారి ఆలోచించాల్సింది అంటూ లేఖ…. .* హనుమకొండ ఆగస్టు 03(మనవార్త ప్రతినిధి):హనుమకొండ నయీమ్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతోన్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెంది కలకలం రేపింది.మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి శివాని (16) ఎం.పి.సి మొదటి సంవత్సరం విద్యార్థినీ,కళాశాల ప్రాంగణంలోనే మృతిచెందింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా కళాశాల యాజమాన్యం నేరుగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి మార్చురీకి తరలించింది.ఈ చర్య పై శివాని … Read more

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం….

* మల్యాల, ఆగష్టు 03(మన వార్త ప్రతినిధి)మల్యాల కేంద్రానికి చెందిన వారంతా 1995 -96 సంవత్సరంలో 10వ తరగతి కలిసి చదివారు. “స్నేహమేరా జీవితం” అను వాట్స్అప్ గ్రూప్ ద్వారా నిత్యం పలకరించుకుంటారు. స్నేహితులలో ఎవరి పుట్టినరోజు అయిన, పెళ్లి రోజైనా అందులో శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఆనాటి నుంచి చిగురించిన వారి స్నేహం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కష్టసుఖాలను సమానంగా పంచుకుంటూ.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. అందరూ కలిసి … Read more

అటెండెన్స్ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వాడిన పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్…

ఆగస్టు 1,జగిత్యాల (మన వార్త ప్రతినిధి)జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయ పల్లె గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రాజన్న రోజు విధులకు హాజరు కాలేక అటెండెన్స్ కోసం తాను లేకపోయినా అటెండెన్స్ పడడానికి ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వాడి అటెండెన్స్ వేయించుకుంటున్న తరుణంలో అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం వల్ల జగిత్యాల జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి రాజన్న ను సస్పెన్షన్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం … Read more

విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయులు- జగిత్యాల మైనారిటీ గురుకులం ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం….

…ఆగస్టు 1 జగిత్యాల (మన వార్త ప్రతినిధి)జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న మైనారిటీ గురుకులం ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయులు ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి టీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చిన పుస్తకాలను స్కూల్ లోపలికి తరలించేందుకు స్కూల్ నుండి కార్గో బస్సు రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా దూరంలోనే నిలిపివేశారు. అక్కడి నుండి అటెండర్ల సహాయంతో స్కూల్ లోపలికి తరలించాల్సిన … Read more

గడ్డి మందు సేవించి యువకుడు మృతి కుటుంబ సభ్యుల రోదన.మొలంగూర్ గ్రామంలో విషాదం…

శంకరపట్నం:జూలై31(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ళ శ్రీకాంత్ (25)అనే యువకుడు గడ్డి మందు సేవించి గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్ తండ్రితో కలిసి సొంత భూమితో పాటు కొంత వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు, కాగా బుధవారం గడ్డి మందు సేవించిన శ్రీకాంత్ ను కుటుంబ సభ్యులు గమనించి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన … Read more

గజ్వేల్ ప్రెజ్నాపూర్ మున్సిపాలిటీ లో ఫైర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగ సందర్షించిన గజ్వేల్ కాంగ్రెస్ నేతలు….

*గజ్వేల్ జూలై 31( మన వార్త ప్రతినిధి జీ మురళి) సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు *శ్రీ తూంకుంట నర్సారెడ్డి గారి* ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను సందర్షించి అక్కడి రైతులతో మాట్లాడడం జరిగింది, ఎరువుల గోదాంలను కూడ పరిశీలించడం జరిగింది, గజ్వేల్ లో ఎరువుల కొరత లేదు అది ప్రతిపక్షాల అభూత కల్పన , వాస్తవానికి యూరియా ఎరువుల పంపిణీ కేంద్ర ప్రభుత్వానిది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … Read more

108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం…

చిన్న శంకరంపేటజూలై 30(మన వార్త ప్రతినిధి నరేందర్) మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన విజయ కి పురటి నొప్పులు రావడం తో 108 కి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మెదక్ తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ కావడం తో EMT నవీన్ ప్రసవం చేశారు పండంటీ మగ బిడ్డ కు జన్మ నివ్వడం తో తల్లి బిడ్డ ను మెదక్ మత శిశు … Read more