జగిత్యాల జిల్లా. ఏప్రిల్ 30 (మన వార్త ) జగిత్యాల జిల్లాకు చెందిన బీరెల్లి హాసిని పదవ తరగతి పరీక్షల్లో 581 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది.హాసిని క్రమశిక్షణతో చదువుతూ ఈ విజయాన్ని సాధించిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ హాసిని మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. , స్నేహితులు హాసినిని అభినందించారు.