ఎల్కతుర్తి వైన్‌షాప్‌లో దొంగతనం ఎల్కతుర్తి….

అక్టోబర్16 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్న వినాయక వైన్ షాప్‌లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి మద్యం బాటిల్స్‌తో పాటు కౌంటర్‌లో ఉన్న నగదు మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే దుకాణంలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్ బాక్సులను కూడా దొంగలు తమతో తీసుకెళ్లినట్లు సమాచారం.దొంగలు షాప్ వెనుకవైపు గోడ దాటి లోపలికి ప్రవేశించి, బాటిల్స్, క్యాష్, సీసీటీవీ రికార్డింగ్ పరికరాలు తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన సిబ్బంది … Read more

జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తాం… – టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలో మెగా హెల్త్ క్యాంప్- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ…

రామాయంపేట అక్టోబర్ 16 ( మన వార్త ప్రతినిధి )జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించే విధంగా టీయూడబ్ల్యూజే తరఫున కృషి చేస్తున్నామని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి అన్నారు. గురువారం స్థానిక ప్రగతి రిసార్ట్ లో రామాయంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే, జర్నలిస్టులకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. జర్నలిస్టుల … Read more

కార్పొరేటర్ ఇంట్లో పేకాట….

హనుమకొండ అక్టోబర్ 14(మనవార్త ప్రతినిధి):హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట ఆడుతున్నా సమాచారంతో తనిఖీ చేసినట్టు పోలీసులు తెలిపారు.. 12 మంది పట్టుబడినట్టు, వారి నుండి 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం … Read more

అల్వాల్‌లో పేకాట పై దాడి – ఏడుగురు అరెస్ట్, రూ.2.3 లక్షలు స్వాధీనం….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 14 మన వార్త: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే అల్వాల్‌ లోని పంచశీల కాలనీలోని ఒక ఇంటిలో అక్రమంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు దాడి నిర్వహించారు.దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుండి రూ.2.3 లక్షల నగదు, పేకాట పత్తులు స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక విచారణలో నిందితులు సంగారెడ్డి … Read more

చెట్టుకు ఉరి వేసుకుని యువకుడి సూసైడ్…

చిన్నశంకరంపేట అక్టోబర్ 12( మన వార్త ప్రతినిధి)ఇంట్లో నుండి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళ్లిన వ్యక్తి సోమవారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిన్న శంకరంపేట మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం రెడ్డి ప్రసాద్( 25) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుండి తన బైకుపై వెళ్లి రాతి 9 వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు … Read more

గణితం లెక్చరర్ కోసం విద్యార్థినుల నిరసన….

చేగుంట అక్టోబర్ 12( మన వార్త ప్రతినిధి)ఆరు నెలలుగా గణితం లెక్చరర్ రావడం లేదని చేగుంట గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థినులు సోమవారం ఉదయం గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూజూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదన్నారు. భవిష్యత్తు పై భయం తో రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థినిలకు హామీ ఇవ్వడంతో … Read more

గంజాయితో పట్టివేత ముగ్గురు యువకులు అరెస్ట్..సమాచారంతో స్పందించిన పోలీసులు—103 గ్రాముల గంజాయి స్వాధీనం…..

ఇల్లంతకుంట,అక్టోబర్ 11 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయానికి ప్రయత్నం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.శుక్రవారం సాయంత్రం సమయంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్‌కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు చెరువు కట్ట వద్ద మాటు వేసి,గంజాయి అమ్మకానికి వచ్చిన అనంతగిరి గ్రామానికి చెందిన రెడ్డి రాకేష్ రెడ్డి,ఉప్పల ప్రణీత్ రెడ్డి, మాసం మనీష్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 103 గ్రాముల గంజాయిని పంచుల … Read more

ఎర్రవల్లిలో ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల నిరసన…

గజ్వేల్ అక్టోబర్ 11 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుచేసి, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో … Read more

అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అరెస్టు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 9 మన వార్త : అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డిను అల్వాల్ పోలీసు అధికారులు ఆమె నివాసం వద్ద నుంచి అదుపులోకి తీసుకున్నారు. బస్సు ఛార్జీలు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన “చలో బస్ భవన్” పిలుపు నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.ప్రజల పై భారంగా మారే ఈ బస్సు ఛార్జీల పెంపును … Read more

తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 26, మనవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర పోలీసు విభాగంలో పలు కీలక హోదాల్లో సేవలందించిన ఆయనను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ బాధ్యతలకు నియమించారు. ఇప్పటి వరకు డీజీపీగా పనిచేసిన అధికారిని తప్పించి, శివధర్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకంతో రాష్ట్రంలో నూతన పోలీసు పరిపాలన విధానం అమలులోకి రానుందని అధికారులు పేర్కొన్నారు.