తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఫిబ్రవరి 15, మనవార్త.
ఉప్పల్ రింగ్ రోడ్డులో పుల్వామా దాడిలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళుల కార్యక్రమం ఇర్షాద్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని దేశభక్తి భావాలతో సాగింది. అమరవీరుల చిత్రాలకు కొవ్వొత్తులు వెలిగించి, పూల వర్షం కురిపిస్తూ నివాళులు అర్పించారు. అనంతరం “అమర జవాన్లకు జై”, “భారత్ మాతాకి జై” వంటి దేశభక్తి నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది.
ఈ సందర్భంగా ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరచిపోలేనివి. వారి త్యాగాలే నేటి మన స్వేచ్ఛకు పునాది. యువత దేశభక్తిని అలవర్చుకొని, దేశ ఐక్యత కోసం కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమం యువతలో దేశభక్తి భావాలను పెంపొందించడంలో కీలకంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలన్న సందేశాన్ని ఈ నివాళుల కార్యక్రమం స్పష్టంగా తెలియజేసింది.