పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2009-2010 వ బ్యాచ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరునొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ స్థితి గతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,పాఠశాల కు దూరమై 14 సంవత్సరాలు … Read more

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ..**మహిళా శక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా……

ఇల్లంతకుంట,నవంబర్ 23 (మన వార్త ప్రతినిధి)రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం గ్రామ మహిళ సంఘం సభ్యులు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ మాజీ సర్పంచ్,మండల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ,మాజీ ఎంపీటీసీ,జిల్లా మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు తీగల పుష్పలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.మహిళలను కోటీశ్వరులను చేయడమే … Read more

అదుపు తప్పి ఆటో బోల్తా.. ఇద్దరికీ గాయాలు….

బెజ్జంకి,నవంబర్ 23( మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలు బెజ్జంకి సత్య అర్జున ఫంక్షన్ హాల్లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళ శక్తి చీరలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలు తీసుకొని వెళ్తున్న క్రమంలో దాచారం స్టేజి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవకపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.స్థానికులు 108 కి సమాచారం అందించి క్షతగాత్రులను … Read more

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి…మంత్రి ఫోన్ చేసి భరోసా.**దుఃఖంతో మాట్లాడుతున్న బాలరాజుకు ధైర్యం చెప్పిన రవాణా శాఖ మంత్రి..**నిందితుడికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం..

ఇల్లంతకుంట,నవంబర్ 21 (మన వార్త ప్రతినిధి); రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట–సిరిసిల్ల రహదారిలో వల్లంపట్ల గ్రామం వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కల్లూరి బాలరాజుపై..ఓ వ్యక్తి “నా కారుకు సైడ్ ఇవ్వలేదంటూ” అమానుషంగా దాడి చేయడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సంఘటనకు సంబంధించిన వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో “మన తండ్రిలాంటి ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా తన్నడం,కొట్టడం … Read more

బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

చేవెళ్ల నియోజకవర్గం నవంబర్ 21 :మన వార్త ప్రతినిధి చేవెళ్ల పరిధిలోని మొయినాబాద్ ప్రాంతంలో తాజ్ హోటల్ సమీపంలోని బీజాపూర్ హైవేపై ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందాడు.మరో వ్యక్తి చికిత్స పొద్దుతూ మరణించినట్లు సమాచారం. గాయపడిన ఇతరులను స్థానికులు వెంటనే మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుత వారికి చికిత్స అందిస్తున్నారు.ఘటనపై పోలీసులు … Read more

నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు… రుక్మాపూర్ లో 100 ఎకరాల్లో పంట నష్టం.. సీడ్ కంపెనీ విత్తనాల వల్లనే నష్టపోయామని పోలీసులకు ఫిర్యాదు.. సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతుల ఆవేదన…

చేగుంట నవంబర్10( మన వార్త ప్రతినిధి) ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తన రకం 45,47( మగరకం విత్తనం) కంపెనీవారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం గొలలు రాకపోవడం వల్ల నిండా మునిగారు, ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారిని … Read more

ఎల్కతుర్తి లో నాటు కోళ్లు ప్రత్యక్షం..పండగ చేసుకున్న సమీప గ్రామస్తులు…

ఎల్కతుర్తి,నవంబర్ 8 (మనవార్త ప్రతినిధి ) మార్కెట్‌లో నాటు కోడి మాంసం కావాలంటే మటన్‌తో సమానంగా రేటు చెల్లించాల్సిందే. ఆ కూరకు అంత క్రేజ్‌ మరి. అయితే, తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే, నిత్యం రద్దీగా ఉండే సిద్ధిపేట–ఎల్కతుర్తి రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 2 వేలకుపైగా నాటు కోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు.ఆ కోళ్లు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి, ముఖ్యంగా పత్తి … Read more

సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా అల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు….

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 6 మన వార్త: సైబర్ జాగరూకత దివస్” కార్యక్రమాల్లో భాగంగా ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు అల్వాల్ పోలీసులు వివిధ ప్రదేశాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఉదయం వేళల్లో బతుకమ్మ పార్క్ – హై టెన్షన్ రోడ్ వద్ద మోర్నింగ్ వాకర్లకు సైబర్ మోసాల విధానాలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి అనే అంశాలపై పోలీసు సిబ్బంది వివరించారు. తరువాత అభ్యాస్ జూనియర్ కాలేజీ, అల్వాల్లో విద్యార్థులకు … Read more

అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు… జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ నార్సింగి…

నవంబర్ 6( మన వార్త ప్రతినిధి )ఆర్.ఎమ్.పీ వైద్యులు ల్యాబ్ నిర్వహణ, వార్డులు ఏర్పాటు చేసి చికిత్స ఇవ్వడం, మెడికల్ షాప్ నిర్వహించడం చేయకూడదని, ప్రాథమిక చికిత్స మాత్రమే అందివ్వాలని లేదా చట్ట రీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ తన కార్యాలయంలో నార్సింగి మండల విలేకరులతో మాట్లాడుతూ ఆర్.ఎమ్.పీ/ పీ.ఎమ్.పీ లకు అలాగే ప్రజలకు పలు సూచనలు … Read more

పోలీస్ స్టేషన్ ముందు విషాద ఘటనడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మనస్తాపం – పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య….

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నవంబర్ 5 మన వార్త: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి పోలీసుల వ్యవహారంతో మనస్తాపానికి గురై, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అనే వ్యక్తిని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతని బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ … Read more