ఇల్లంతకుంటలో కుండపోత వర్షం – గాలిపల్లి ఎస్సీ కాలనీ జలమయం…ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు…

ఇల్లంతకుంట, ఆగస్టు 27 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ముఖ్యంగా గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ పూర్తిగా నీటమునిగిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎస్.ఏ.ఫారూఖ్,ఎంపీడీవో శ్రీనివాస్,సీఐ మొగిలి,ఎస్సై సిరిసిల్ల అశోక్ మరియు ఇతర శాఖల అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.నీటిమునిగిన ప్రాంతాల్లోని కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తూ రెవెన్యూ, పోలీస్,గ్రామ పంచాయతీ సిబ్బంది హై అలర్ట్‌లో పనిచేస్తున్నారు.కాలనీవాసులను గ్రామంలోని … Read more

భారీ వర్షాల నేపథ్యంలో రేపు మెదక్ జిల్లాలో స్కూళ్లకు సెలవు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. మెదక్ జిల్లాలో నిన్నటి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదలతో అనేక తండాలు నీటిలో మునిగిపోగా..రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకు పోయాయి. మెదక్ లో హవేలీ ఘనపూర్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, మెదక్ పట్టణం, మాసాయిపేట మండలాల్లో అతిభారీ వర్షం కురవక జనజీవనం అస్తవ్యస్తం అయింది. కాగా ఈరోజు రాత్రి, రేపు కూడా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ … Read more

ఎన్.హెచ్ నేషనల్ హైవేపై ప్రమాదం * కరీంనగర్- వరంగల్ నేషనల్ హైవే పై ప్రమాదం….

ఎల్కతుర్తి ఆగస్టు 27 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ సమీపం వద్ద ఎన్‌.హెచ్‌ 563 నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ నుంచి వస్తున్న TS02 EV 9009 నంబరు గల కారు, ఎల్కతుర్తి కి వస్తుండగా..ఎల్కతుర్తి మండలం దండపెల్లి గ్రామానికి చెందిన సంపత్ నడుపుతున్న ఆటోను ఢీకొట్టింది.ఆటోలో ప్రయాణిస్తున్న వారు వల్బాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారితో పాటు బీహార్ రాష్ట్రానికి చెందిన రోడ్ వర్కర్లు కూడా ఉన్నారు.ప్రమాదంలో గాయపడిన … Read more

వర్షాలకు జాగ్రత్తగా ఉండాలి — సిఐ రవి కుమార్…

గజ్వేల్ ఆగస్టు 27 మన వార్త ప్రతినిధి వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు బుధవారం గజ్వేల్ సిఐ రవికుమార్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ,విద్యుత్ వినియోగంలో అనుభవం కలిగిన విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని, గణపతి మండపాల వద్ద అవాంఛనీయ సంఘటన జరిగితే 100 కు లేదా 8712667100 కు కాల్ చేయాలను అన్నారు

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి క్రిమిసమారక మందు తాగి మృతి….

గంభీరావుపేట ఆగస్టు 26 మన వార్త ప్రతినిధి.. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రాయరింగు సతీష్ అనే వ్యక్తి అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది వివరాలకు వెళితే గజసింగవరం గ్రామానికి చెందిన రాయరింగు సతీష్ 35 సం తండ్రి వెంకటయ్య గత మూడు నెలకి తో బోరు వేయగా నీళ్లు పడకపోవడంతో బోరుకు తీసుకువచ్చిన అప్పు అలాగే ఎనిమిదేళ్ల క్రితం హార్వెస్టర్ కొనుగోలు చేసి లోను తీసుకొని ఆర్థిక సమస్యలతో … Read more

మల్కాజ్గిరి నియోజకవర్గంలో మట్టి గణపతుల కొరత – భక్తులు ఆందోళన…..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 26 మన వార్త : మల్కాజ్గిరి నియోజకవర్గం, అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో వినాయక చవితి వేడుకలు సమీపిస్తుండగా, మట్టి గణపతుల విగ్రహాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది.ప్రతి ఏటా కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో మట్టి గణపతులను పంపిణీ చేస్తుండగా, ఈసారి తగినంత విగ్రహాలు అందుబాటులో లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యావరణ హితమైన మట్టి గణపతులు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. చెరువులు, కుంటల్లో కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం, … Read more

గర్భవతైన భార్యను ముక్కలు ముక్కలుగా చేసిన కిరాతకుడు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఆగస్టు 25, మనవార్త. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసాడో భర్త. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ ప్రేమవివాహం చేసుకొని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య హతమార్చి.. అనంతరం శరీరభాగాలను కవర్లోప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి … Read more

జగిత్యాల సిగ్మా ఆస్పత్రిలో పేషెంట్ మృతి….

జగిత్యాల ,ఆగస్టు 23 (మనవార్త ప్రతినిధి సాకేత)జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో గల సిగ్మా ఆస్పత్రిలో, రాయికల్ ప్రాంతానికి చెందిన పేషెంట్ మృతి చెందాడు. ఇది సిగ్మా సిబ్బంది నిర్లక్ష్యమా..? వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదివరకు కూడా ఈ సిగ్మా ఆసుపత్రి పైన పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. ఎన్నిసార్లు వైద్యులు మారిన లాభం లేకపోయిందని సిబ్బంది ప్రవర్తన కూడా అమానుషంగా ఉంటుందని అక్కడి ప్రజలు పేర్కొన్నారు.

కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ అశోక్ సస్పెండ్……

కుత్బుల్లాపూర్ ఆగష్టు 23( మన వార్త ప్రతినిధి రాజు)మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారు. బాచుపల్లి లో సర్వే నెంబర్ 83 భూ నిషేధం లో ఉన్న భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నిషేధిత భూమి బదిలీలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. కోట్లు విలువ చేసే భూమిని సబ్ రిజిస్ట్రార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారని 22ఏ … Read more

వెంకటాపురం డివిజన్‌లో రోడ్లపైనే పార్కింగ్ – ప్రజలకు ఇబ్బందులు…..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 22 మన వార్త : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని వెంకటాపురం డివిజన్ ప్రాంతంలో పలు కమర్షియల్ సంస్థలు రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాచర్ల కిచెన్స్, పంజాబీ తడక వంటి హోటళ్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీమ్ పార్లర్ వంటి వ్యాపార సంస్థలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని వాణిజ్య లాభాలు పొందుతున్నాయి. ఫలితంగా రోడ్లపై అక్రమ నిర్మాణాలు పెరిగి, వాహనదారులకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.కాలనీ వాసులు మాట్లాడుతూ,కాలనీ … Read more