మద్యం సేవించి వాహనాలు నడపకూడదు…

-11 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు…
-ఎస్సై కదిరె శ్రీకాంత్ గౌడ్…
( మన వార్త ప్రతినిధి బొంగోని రాజు) ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో ఆదివారం రోజున వాహనాలు తనిఖీ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై కదిరే శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని తెలిపారు.వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు.

Leave a Comment