*గజ్వేల్ జూలై 29( మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలోమంగళవారం నాగుల పంచమి సందర్భంగా గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించిన మహిళలు పండ్లు , పువ్వులు పసుపు కుంకుమ వేసి మంగళ హారతితలు ఇచ్చి నైవేద్యం సమర్పించి నాగదేవత మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నాగ దేవతకు పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం అని అన్నారు నాగుల పంచమి సందర్భంగా ఆ నాగదేవత ఆశీస్సులు అందరిపై ప్రసరించాలని, వారి కృపతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ చెరువులు వాగులు కుంటలు నీటితోనుండి పంటలు బాగా పండాలని భక్తులు కోరారు