ఆలయాల్లో చోరీ చేసిన నిందితుడి అరెస్ట్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి……

ఆలయాల్లో చోరీ చేసిన నిందితుడి అరెస్ట్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలంలోని పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ తాగుడుకు, జల్సాలకు బానిసై గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మల్కాపూర్ లోని నూతనంగా నిర్మించిన శివాలయం తోపాటు దుర్గామాత ఆలయం, తూప్రాన్ మున్సిపాలిటీ లోని మహంకాళి ఆలయంలో హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణంగా వచ్చారు. మల్కాపూర్ శివాలయ ధర్మకర్త అమ్మిరి శెట్టి సతీష్ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు జహంగీర్ ను అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు. ఇదే అదనుగ భావించి నిందితుడు జాంగిర్ తిరిగి మహంకాళి ఆలయంలో వారం రోజుల క్రితం చోరీకి పాల్పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులు జహంగీర్ ను రిమాండ్ కు పంపడంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Leave a Comment