శభాష్ ఆలయ సిబ్బంది…

-హనుమాన్ జయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయన్న ఆలయ ఈవో శ్రీకాంత్ రావు…

మల్యాల, మే 28(మన వార్త ప్రతినిధి)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 20 నుండి 22 వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది సహాయ సహకారాలతోనే ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ సిబ్బందికి శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటో, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈవోకు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment