చేగుంట నవంబర్10( మన వార్త ప్రతినిధి) ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తన రకం 45,47( మగరకం విత్తనం) కంపెనీవారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం గొలలు రాకపోవడం వల్ల నిండా మునిగారు, ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు పంట కోతకు వచ్చే సమయంలో వారికి కొన్ని పొలాల్లో ఒకటి రెండు పిలకలు మాత్రమే వచ్చాయని మరికొంతమంది రైతుల పొలాల్లో మాత్రం మొత్తం పంట ఎండిపోయిందని రైతులకు తెలిపారు లాభం రావడం దేవుడేరుగు కానీ కనీసం పెట్టిన పెట్టుబడి దిగబడి కూడా రాకపోవడంతో రైతులు కన్నీరు పెట్టారు, ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక రైతులు వ్యవసాయ అధికారులకు చూపిన విత్తనాల ప్రాబ్లమ్ అని తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకు సుమారు 25 వేల నుండి 30 వేల వరకు ఖర్చు చేశారు ఈ నకిలీ విత్తనాల పట్ల రుక్మాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు సుమారు 20 లక్షల వరకు నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, విత్తనాలు ఇచ్చిన సీడ్ కంపెనీ సూపర్వైజర్ ఫోన్ లేపడం లేదని కనీసం మళ్ళీ గ్రామానికి కూడా రావడం లేదని ఈ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని అధికారులకు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు పిలుకలు తక్కువగా వస్తున్నాయని సూపర్వైజర్ కు ఫోన్ చేస్తే అతను చెప్పిన మందు కొనుగోలు చేసి పొలానికి పిచికారి చేసామని దీంతో పంట పూర్తిగా మాడిపోయిందని గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, గణేష్, లక్ష్మీ, రామచంద్రం, మోహన్, అనే రైతులు లబోదిబోమన్నారు సదరు విత్తన కంపెనీ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతుల కోరుతున్నారు.