చికిత్స పొందుతూ యువకుడు మృతి తూప్రాన్….

జూన్ 20 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చేగుంట మండలం చందాయి పేటకు చెందిన భీమరబోయిన మహేష్ (28) కుటుంబం కొన్నేళ్లుగా తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ లో నివాసం ఉంటున్నారు. నెలరోజుల క్రితం బైక్ పై వస్తూ మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మహేష్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

Leave a Comment