కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం…..
.బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు సంవత్సరాల పాప హరిప్రియ ఉన్నటుస్థానికులు తెలిపారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదషయాలు అలుముకున్నాయి.సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం కాగ పలువురు డబ్బుల విషయంలో ఒత్తిడి తేగా పురుగుల మందు సేవించి నట్టు ఆత్మహత్యం చేసుకున్నారు.సమాచారం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య ఘటన స్థలానికి చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందనీ పోలీసులు తెలిపారు.